”నాలుగో టెస్టులో అసలు హీరో శార్దూల్ ఠాకూర్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకంటే శార్దూల్కు ఇచ్చి ఉంటే ఎక్కువగా సంతోషపడేది నేనే. తొలి ఇన్నింగ్స్లో తామంతా బ్యాటింగ్లో విఫలమైనప్పుడు శార్దూల్ మాత్రం మెరుపు అర్థసెంచరీతో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ ప్రధాన బ్యాట్స్మెన్ అవుటైన తర్వాత పంత్తో కలిసి దాదాపు వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడమే గాక మరో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక బౌలింగ్లోనూ తన సత్తా ఏంటో చూపించాడు.
100 పరుగుల వరకు వికెట్ నష్టపోకుండా పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ను దెబ్బతీసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇలాంటి మొమరబుల్ ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్కు ఇవే నా కృతజ్ఞతలు. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు నాకంటే శార్దూల్కే ఎక్కువ అర్హతలున్నాయి. ఏది ఏమైనా నా దృష్టిలో నేను ఈ అవార్డును శార్దూల్తో పంచుకున్నా. ప్రస్తుతం ఫామ్ దృశ్యా అందరం అద్భుతంగా ఉన్నాం.. ఇక సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడం సంతోషంగా అనిపిస్తుంది. చివరి మ్యాచ్లోనూ ఇలాంటి ప్రతిభను కనబరిచి 3-1తో సిరీస్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.దీనిని ఇలాగే కొనసాగిస్తాం.” అంటూ చెప్పుకొచ్చాడు.
]]>► విరాట్ కోహ్లిని ఔట్ చేయడం ద్వారా మొయిన్ అలీ కొత్త రికార్డు సాధించాడు. ఓవరాల్గా మొయిన్ అలీ అన్ని ఫార్మాట్లు కలిపి కోహ్లిని ఇప్పటివరకు 10 సార్లు ఔట్ చేశాడు. దీంతో కోహ్లిని ఎక్కువసార్లు ఔట్ చేసిన తొలి బౌలర్గా నిలిచాడు. అంతేకాదు టెస్టుల్లో ఆరుసార్లు కోహ్లిని అవుట్ చేశాడు. టెస్టుల్లో కోహ్లిని ఎక్కువసార్లు అవుట్ చేసిన జాబితాలో అలీ రెండో స్థానంలో ఉన్నాడు. జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్), నాథన్ లియాన్(ఆస్ట్రేలియా)లు కోహ్లిని ఏడేసి సార్లు ఔట్ చేసి తొలి స్థానంలో నిలిచారు.
► 21వ శతాబ్దంలో ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 400కు పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 2002లో నాటింగ్హమ్ టెస్టులో టీమిండియా 428 పరుగులు చేసింది.
► డకౌట్ల విషయంలో అజింక్యా రహానే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై మూడుసార్లు డకౌట్గా వెనుదిరిగిన తొలి భారత బ్యాట్స్మన్గా రహానే నిలిచాడు. 2014, 2018లో ఇదే ఓవల్ మైదానంలో రహానే రెండుసార్లు డకౌట్ అయ్యాడు.
► ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై వెయ్యి పరుగులు సాధించిన మూడో ఆసియా ప్లేయర్గా కోహ్లి నిలిచాడు. ఇంతకముందు ఆసియా నుంచి సచిన్, ద్రవిడ్లు మాత్రమే ఉన్నారు.
]]>బౌలింగ్ ర్యాంకుల్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం మెరుగుపర్చుకుని పదో ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలింగ్ లిస్టులో ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఎలాంటి మార్పులేదు. టీమిండియాతో టెస్టు సిరీస్ లో సత్తా చాటుతున్న ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ‘ఆరు’ నుంచి ఐదోస్థానానికి చేరుకున్నాడు.
]]>” గెట్ వెల్ సూన్ క్రిస్ కెయిన్స్.. నేస్తమా త్వరగా కోలుకో.. నీ ఆరోగ్యం తొందరగా బాగవ్వాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.” అంటూ ట్వీట్ చేశాడు. కాగా 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి ఆల్రౌండర్గా పేరు పొందిన కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్కు దిగేవాడు.
]]>