హైదరాబాద్ లోని ఫిలిం నగర్ జంక్షన్ వద్ద శర్వానంద్ కు ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో ఆయనకు గాయాలు అయ్యాయి. వెంటనే ఈ ప్రమాదం చూసిన స్థానికులు శర్వానంద్ను ఆసుపత్రికి తరలించారు.
]]>‘ఆర్.ఆర్.ఆర్’ ఆస్కార్ నామినేషన్ లో వున్న దగ్గర నుంచి అందరి దృష్టి ఈ ‘ఆర్.ఆర్.ఆర్’ పైనే వుంది. అయితే ఉత్తమ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నామినేషన్ లో ఉంటాడు అనుకుంటే, చివరికి ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో నామినేషలో చోటు సంపాదించింది. ఇక అప్పటి నుండి ఈ పాటకి ఆస్కార్ అవార్డు వస్తుంది అని అందరూ అనుకున్నారు. ప్రపంచం అంతా ఈ సినిమాకి దాసోహం అయింది. దర్శకుడు రాజమౌళి ప్రతిభని మెచ్చుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులు అయిన స్టీవెన్ స్పెల్ బెర్గ్ , జేమ్స్ కామెరూన్ లాంటి వారే రాజమౌళిని అతని సినిమాని మెచ్చుకున్నారు. ఇంతమంది మెచ్చుకున్నాక, ‘ఆర్.ఆర్.ఆర్’ కి ఆస్కార్ అవార్డు గ్యారంటీ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఈసారి తెలుగువాడి జయకేతనం ఆస్కార్ లో వెలిగింది. మన తెలుగు, భారత పతాకం ఆస్కార్ లో ఎగిరింది. ఇంతకు ముందు భాను అతియా, రసూల్ పూకొట్టి, గుల్జార్, ఏ.ఆర్. రెహమాన్ ఈ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. 2009 లో సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ కి ‘జై హో’ సాంగ్ కి గాను ఆస్కార్ వచ్చింది. మళ్ళి ఇప్పుడు మన తెలుగు తేజాలు కీరవాణి, చంద్రబోస్ లు ఈ అవార్డును అందుకున్నారు.
]]>అయితే స్పెషల్ సాంగ్స్, సహాయ నటిగా అలరించిన ఈ హీరోయిన్.. గత రెండేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని గతేడాది డిసెంబర్లో ఆ మహమ్మారిని జయించింది. ఈ క్రమంలో ఇప్పుడు తిరిగి తన లపై దృష్టి పెట్టింది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయిన హంసానందిని తాజాగా ఓ ఆసక్తికర వీడియో షేర్ చేయగా.. అది కాస్త నెట్టింట వైరలవుతుంది. ఏడాది క్రితం క్యాన్సర్ చికిత్సలో భాగంగా పూర్తిగా జుట్టు కోల్పోయి గుండుతో ఉన్న వీడియోతోపాటు..
ఆ మహమ్మారిని జయించి తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న ఆమె సముద్రపు ఒడ్డున అందంగా మారిన తర్వాత సంతోషంతో ఉన్న వీడియోను షేర్ చేసింది. ఒక సంవత్సరంలో చాలా జరిగాయి. ప్రస్తుతానికైతే బాగున్నాను అంటూ రాసుకొచ్చింది. జుట్టు ఉన్నప్పుడే కాదు.. లేనప్పుడు కూడా అందంగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. హీరోయిన్ గానే కాకుండా.. సహయనటిగా అత్తారింటికి దారేది, మిర్చి, లెజెండ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త ల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. అలాగే లౌక్యం, రుద్రమదేవి, జై లవకుశ సహా పలు చిత్రాల్లోనూ నటించింది.
]]>ఈ బిట్ వినగానే మీలో చాలమందికి ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. ఇది నందమూరి బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ కొత్త సినిమాలో పంచ్ డైలాగ్…ఆయనేం చెప్పినా, చేసినా అది వెరైటీగానే ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే…
ఇంతకీ విషయం ఏమిటంటే…నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన సంక్రాంతి సినిమా వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు లోని ఏఐజీ మైదానంలో ఘనంగా జరిగింది. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా?అన్నంత హడావుడిగా వాతావరణమంతా మారిపోయింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో బాలకృష్ణ, శృతిహాసన్, నిర్మాతలు నవీన్, రవిచంద్రలు ఒంగోలు చేరుకున్నారు.
బాలకృష్ణ సినిమా అంటే అభిమానుల్లో ఫుల్ జోష్ ఉంటుంది. ఎందుకంటే సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఫ్యాక్షనిజం సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలకృష్ణ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఫ్యాక్షన్ సినిమాలు తీసి విఫలమయ్యారు. మళ్లీ వాటి జోలికి వెళ్లలేదు. చిన్న హీరోలు కూడా ఆ ప్రయత్నాలు చేసి బాక్సాఫీసు దగ్గర బోల్తాపడ్డారు. ఆ ఫ్యాక్షనిజాన్ని పండించాలంటే నందమూరి బాలకృష్ణ తర్వాతేనని, అంతా మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. దాంతో బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలకి బ్రాండ్ అంబాసిడార్ గా మారిపోయారు.
ఈకోవలో వస్తున్నదే… వీర సింహారెడ్డి సినిమా…సంక్రాంతికి విడుదలవుతున్న సినిమా ప్రీరిలీజ్ వేడుకలు ఒంగోలులో ఘనంగా జరిగాయి. అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మీ అభిమానం చూస్తుంటే…నా జన్మ ధన్యమైనట్టుగా ఉంది. అందరూ బాలకృష్ణ సినిమాలకి, రాజకీయాలకే పరిమితమైపోయాడని అనుకున్నారు. ‘‘నాలో ఇంకా కసి ఉంది. చివరి వరకు నటిస్తూనే ఉంటా’’ అందుకే ‘అన్ స్టాపబుల్ ’ చేస్తున్నా…ఇప్పుడా ప్రోగ్రాం నెంబర్ 1గా ఉందని తెలిపారు.
నాకు జన్మనచ్చి, మీ అందరి గుండెల్లో నిలిపినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగే ఆయనకు ముందుగా శత జయంతి అభినందనలు చెబుతున్నానని అన్నారు. నా తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే అన్నారు. ఆయన నటనలో చేయని ప్రయోగాలు అంటూ లేవు. అలాంటి నటుడు మరొకరు లేరనే సంగతి ప్రతీ ఒక్క నటుడు అంగీకరిస్తారని తెలిపారు. ప్రతీ ఒక్కరికి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలిపారు.
ఎప్పటికైనా మంగోలియన్స్ అయిన జంగిస్ ఖాన్ సినిమా తీస్తానని అన్నారు. ఇది నా జీవితాశయమని తెలిపారు. మా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా భావించే బి.గోపాల్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించాం. ఆయనతో నేను చేసిన సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మీ అందరికీ తెలుసునని అన్నారు. ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేనిది ఒంగోలు, నా తదుపరి చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిది ఒంగోలు…నేను ఒక్క ప్రాంతానికి, ఒక కులానికి చెందిన వాడినికాదు… మానవారణ్యంలో కల్మషం, కుతంత్రాలను వేటాడే సింహరాజును నేనే, రెడ్డిని నేనే, నాయుడిని నేనే, అన్ని కులాలు ఆదరించే మీ బాలకృష్ణని అని అభిమానుల హర్షధ్వానాల మధ్య తెలిపారు.
చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాల్లో వీర సింహారెడ్డి కూడా ఒకటి అవుతుందని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. నటీనటులు, టెక్నీషియన్లు కష్టపడి పనిచేశారని కితాబునిచ్చారు. హీరోయిన్ శృతిహాసన్ మాట్లాడుతూ నేను దర్శకుడు గోపీచంద్ తో చేసిన మూడో సినిమా ఇది. ఆయన్ని నేను అన్నయ్యగా భావిస్తాను. బాలకృష్ణగారు పాజిటివ్ పర్సన్, ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారని అన్నారు.
]]>త్వరలోనే ఈ వ్యాధి నుంచి బయటపడతానని, ప్రస్తుతానికైతే తాను ఇంకా చావలేదన్నారు. మన నియంత్రణలో ఏదీ ఉండదని, మన లైఫ్ డిసైడ్ చేస్తుందని తెలిపారు. తాను ఇపుడు కఠిన పరిస్థితుల్లోనే ఉన్నానని గుర్తుచేసిన సమంత.. అందరి జీవితాల్లో మంచి చెడు రోజులు ఉంటాయని చెప్పారు. ఒక్కక్కసారి ఒక్క అడుగు కూడా వేయలేమో అని అనిపిస్తుందని, అయితే, తాను పోరాటం చేస్తానని, గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసినప్పటి నుంచి సినీ పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు ఎంతో ఆవేదన చెందుతూ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా నటించిన యశోద చిత్రం ప్రమోషన్ కోసం తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆమె ఒకింత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
]]>అంతేకాకుండా జీవిత ఇచ్చిన చెక్ను బ్యాంకులో డిపాజిట్ చేయగా… అది బౌన్స్ అయ్యిందని పేర్కొంది. ఈ వ్యవహారంపై గ్రూప్ యాజమాన్యం నగరి కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు… జీవితా రాజశేఖర్కు నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై గతంలోనే స్పందించిన జీవిత… జోస్టర్ గ్రూప్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అయితే కోర్టులపై తమకు గౌరవం ఉందని, కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరు అవుతామని కూడా ఆమె తెలిపారు.
ఈ క్రమంలో గురువారం జరిగిన కోర్టు విచారణకు జీవిత స్వయంగా హాజరయ్యారు. తన న్యాయవాదులను వెంటబెట్టుకుని ఆమె కోర్టుకు వచ్చారు.
]]>కాగా, ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన యువతులు పాలుపంచుకున్నారు. వీరందరినీ వెనక్కి నెట్టిన ఛరిష్మా… ఓ వైపు చదువుల్లో రాణిస్తూనే మరోవైపు నృత్యకారిణిగా, నటిగా రాణిస్తున్నారు. కాగా, ఈ పోటీలో తమిళనాడుకు చెందిన దేబ్నితా కర్ ఫస్టర్ రన్నరప్గా నిలువగా కర్నాటకకు చెందిన సమృద్ధి శెట్టి రెండో రన్నరప్గా నిలిచింది.
]]>ఇదిలా వుండగా, సలార్ సినిమా షూట్లో భాగంగా ఆ సినిమాకు ఎక్కువగా పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ఆ సినిమాను రెండు భాగాలుగా తీయడమే.. దీంతో అదనంగా ప్రభాస్ డేట్స్ ఇవ్వాల్సి వుంటుంది. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె. కూడా వుంది. మరోవైపు రామాయణం బేస్తో మరో సినిమా చేస్తున్నాడు.
సమాచారం మేరకు ప్రభాస్ ప్రస్తుతం వంద కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక సలార్ సినిమా షూటింగ్ ఎక్కువ కాలం జరగడంతోపాటు దాన్ని రెండు భాగాలుగా చేయాలని నిర్మాతలు, దర్శకుడు డిసైడ్ కావడంతో అదనంగా దాదాపు 20 కోట్లు పెంచినట్లు తెలిసింది. దీనికి నిర్మాతలు సమ్మతించారు. ఇప్పటికే పాన్ ఇండియాతోపాటు పలు విదేశీ భాషల్లో ప్రభాస్ సినిమా వెళుతుంది. దాంతో ప్రభాస్కు ఇవ్వడం సమ్మతమేనని కొందరు తెలియజేస్తున్నారు. అయితే ఇటీవల కార్మికులు తన వేతనం 45 శాతం పెంచాలని డిమాండ్ చేయడం, దిల్ రాజు ఆధ్వర్యంలో కమిటీ వేయడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ పారితోషికం పెరగడం హాట్ టాపిక్గా మారింది.
]]>చైతు అమీర్ఖాన్తో నటించిన లాల్సింగ్ చద్దా ఆగస్టు 11న వస్తుంటే, సమంత నటించిన థ్రిల్లర్ మూవీ యశోద ఆగస్టు 12న రిలీజ్ అవుతోంది. విడాకుల తర్వాత చైతు పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేడు. కాంట్రవర్సీ పోస్టులు కూడా పెట్టలేదు. సమంత మాత్రం అనేకానేక అర్థాలు, సందేహాలకు తావిచ్చేలా పోస్టులు పెడుతూ వచ్చింది.
విడాకులైనా సమంతపై నాగార్జున ప్రేమ తగ్గలేదు. కోడలుగా ఆమెపై ఆప్యాయతగా వుంటున్నారు. విడాకుల తర్వాత కూడా నాగ్ సమంత మా ఇంటి ఆడబిడ్డే.. ఆమె అంటే గౌరవం ఉందని నాగార్జున చెప్పాడు.
తాజాగా నాగార్జున నేరుగా వెళ్లి తన మాజీ కోడలు సమంత నాన్నను కలిశాడన్న వార్తలు వస్తున్నాయి. గంటపాటు వీరిద్దరు చర్చించుకోగా.. సమంత – చైతు భవిష్యత్తు బాగుండేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అక్కడే సమంత కూడా ఉండడంతో నాగ్.. సమంతతోనూ మాట్లాడినట్టు చెపుతున్నారు.
నాగ్ మళ్లీ చైతుకు పెళ్లి చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఈ రెండో పెళ్లికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదనే సామ్ను, ఆమె తండ్రిని కలిసినట్టు తెలుస్తోంది.
]]>