శుక్ర, శనివారాల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 268 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని ప్రకటించింది. మరో 235 మండలాల్లో వడగాల్పుల ప్రభావంగా ఉంటుందని తెలిపింది.
గురువారం అనకాపల్లి జిల్లాలోని 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. విశాఖపట్నం జిల్లాలోని 8 మండలాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా కురిచేడులో 44.2 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.1 డిగ్రీలు, తిరుపతి జిల్లా సత్యవేడులో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే విశాఖపట్నం, బాపట్లలో 7.1 డిగ్రీలు, మచిలీపట్నంలో 6.9 డిగ్రీలు, జంగమహేశ్వరపురంలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డయ్యాయి.
]]>ఇప్పటికే ఏపీ లోని పలు ప్రాంతాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. పశ్చిమ విదర్భ నుంచి మరాఠడ్వా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతుందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఉరుములు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతోంది. మరోవైపు, అకాల వర్షానికి వరి పంటంతా నీటిపాలు అయిందని రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈదురు గాలులకు మామిడి పంటంతా నేలరాలడంతో రైతులు తల్లడిల్లుతున్నారు.
]]>ఇక ఆంధ్రప్రదేశ్ లో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయి, చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండురోజుల్లో పంటను తీసుకువెళ్లి ఒబ్బిడి చేసుకుందామనే వేళ మాయదారి తుపాను రోడ్డున పడేసిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ధాన్యం తడిసిపోతే, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పత్తిపంట పాడైపోయిందని, మరోవైపు వానల వల్ల మిరపరైతులకు నష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ విషయానికి వస్తే మాండూస్ తుపాను ప్రభావం మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని అంటున్నారు. తుపాను వదిలిపోయినా వర్షాలు పడుతుండటంపై వాతావరణంలో సమతుల్యత దెబ్బతిందని, విపరీతమైన ఎండలు, వణికించే చలి గాలులు ఇవన్నీ వీటి ఫలితమేనని సీనియర్లు నొక్కి వక్కానిస్తున్నారు.
]]>సిత్రాంగ్ అంటే థాయ్ భాషలో “వదలని” అని అర్థం. సిత్రాంగ్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్లలో భారీగా వర్షాలు కురువనున్నాయట.
మరోవైపు నవంబరులో ఏర్పడే వాయుగుండాలు తుఫానుగా బలపడేందుకు అవకాశముందని విశాఖకు చెందిన వాతావరణ నిపుణుడు మురళీ కృష్ణ పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే కొద్ది రోజుల పాటు రాష్ట్ర మంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.
]]>కానీ పరిస్థితి చూస్తుంటే వర్షాలు తగ్గుముఖం పట్టేలా కనిపించట్లేదు. రాష్ట్రంలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మరో 8 జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కరీంనగర్ జిల్లా రామడుగులోని గుంది ప్రాంతంలో అత్యధికంగా 20.8 సెం.మీ, చొప్పదండిలోని ఆర్నకొండ ప్రాంతంలో 20.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లా బోధన్ చిన్న మవందిలో 11.4 సెం.మీ వర్షపాతం నమోదైంది.
]]>