జాతీయ వార్తలు

డాక్టర్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కోల్‌కతా :- కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలాఉండగా.. ఈ ఘటన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో భాగంగా ఆర్జీకార్‌ మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌తో సహా అభయతో చివరిసారిగా ఉన్న మరో నలుగురు డాక్టర్లకు పాలిగ్రాఫ్ టెస్ట్ (లై డిటెక్టర్ టెస్ట్) చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే సీబీఐ చేసిన విజ్ఞప్తికి కోల్‌కతాలోని ప్రత్యేక కూడా వీళ్లకు పాలిగ్రాఫ్ టెస్టు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది.

అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్‌ రాయ్‌కు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు ఇప్పటికే కోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వీళ్లకి పాలిగ్రాఫ్ టెస్టు చేసేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. మరో విషయం ఏంటంటే వాస్తవానికి పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ ద్వారా అధికారులు సేకరించిన వివరాలను కోర్టులు అంగీకరించవు. కానీ ఈ కేసులో కీలక ఆధారాలను గుర్తించేందుకు ఈ టెస్టు ఉపయోగపడుతందనే కారణంతోనే సీబీఐ ఈ విధానాన్ని ఎంచుకుంది.

Leave a Reply