కోటి రూపాయలు ఇవ్వలిసేందే … కంచరన కిరణ్ కుమార్
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం లో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కోటి రూపాయలు చొప్పున నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని … రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కంచరన కిరణ్ కుమార్ గారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇచ్చి మానవత్వం చూపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కి సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లో… ఎల్జీ పాలిమర్స్ లో దుర్ఘటన జరిగిన వెంటనే నాడు సీఎం గా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను స్వయంగా వచ్చి దేశ చరిత్రలో లో ఎప్పుడూ లేని విందంగా బాధిత కుటుంబాలు కు కోటి రూపాయలు నష్ట పరిహారం అందజేయడం తో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగులు ఇచ్చారని గుర్తు చేశారు. అదే విధంగా ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మానవత్వం తో వ్యవహరించాలనీ సూచించారు.

