అంతర్జాతీయ వార్తలు

హిందూ ఆలయంపై దాడి .. భారత్ స్ట్రాంగ్ వార్నింగ్..

KPS డిజిటల్ నెట్‌వర్క్, అమెరికా :- అమెరికాలో స్వామి నారాయణ్ మందిర్ దేవాలయంలో జరిగిన సంఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది. తాజాగా ఈ ఘటన పై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ఆలయ గోడలపై భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్తాన్ వర్గం వారు వివాదాస్పద వ్యాఖ్యలు రాసారు. ఆలయంలో ఖలిస్తాన్ కి అనుకూలంగా నినాదాలు రాశారు. అంతేకాకుండా ఆలయ పరిశర ప్రాంతాలను ధ్వంసం చేశారు.

ఈ ఘటన‌పై నెవార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన పై పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన డిసెంబర్ 22 న వెలుగులోకి వచ్చింది అని పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు రోజు రాత్రి ఈ ఘటన చోటుచేస్కుందని పోలీసులు పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని విడిచిపెట్టబోమని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. తీవ్రవాదులు , వేర్పాటు వాదులు ఇతర ఏ వ్యతిరేక శక్తులకు తాము చోటు ఇవ్వమని ఆయన తెలిపారు. ఈ ఘటన భారతీయుల మనోభావాలను కించపరిచిందని తెలిపారు.

ఆలయంపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఉన్న భారత రాయబార కార్యాలయం పేర్కొంది. శాన్ ఫ్రాన్సిస్కోలో ని భారత కాన్సులేట్ ఈ ఘటనపై అన్ని విధాల దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని యూఎస్ ప్రభుత్వానికి, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.

Leave a Reply