ఆంధ్రప్రదేశ్

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌ కీర్తికి జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు..

KPS డిజిటల్ నెట్‌వర్క్, గుంటూరు :- మున్సిపల్ కమీషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది . కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్‌ను నడుపుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

పిటిషనర్‌లకు ₹25 లక్షలు చెల్లించాలని కోర్టు గతంలో ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్‌ అమలు చేయడంలేదని పిటిషనర్‌ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, ₹2వేల జరిమానాను హైకోర్టు విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రారు వద్ద లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది.

Leave a Reply